AP: పైపుల లారీలో రూ.8 కోట్ల నగదు సీజ్
ఎన్నికలు (elections) సమీపిస్తున్న వేళ తెలుగు రాష్టాల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. తాజాగా ఏపీలోని (ap) ఎన్టీఆర్ జిల్లా (ntr district) గరికపాడు చెక్పోస్టు (garikapadu checkpost) వద్ద రూ.8 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎన్నికలు (elections) సమీపిస్తున్న వేళ తెలుగు రాష్టాల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. తాజాగా ఏపీలోని (ap) ఎన్టీఆర్ జిల్లా (ntr district) గరికపాడు చెక్పోస్టు (garikapadu checkpost) వద్ద రూ.8 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ లారీలో (lorry) పైపులు (pipes) లోడ్ చేసుకొని హైదరాబాద్ (Hyderabad) నుంచి గుంటూరుకు (Guntur) వెళ్తుండగా ఎన్టీఆర్ జిల్లాలోని గరికపాడు చెక్పోస్ట్ వద్ద అధికారులు వాహానాన్ని ఆపి చెక్ చేశారు. లారీలోని ప్రత్యేక క్యాబిన్లో నగదుని గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకి సంబంధించి తగిన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు ఆ నగదుని సీజ్ చేశారు. లారీలో ఉన్న ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. జగ్గయ్యపేట (jaggaiahpet) సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ (Chandra shekhar) మాట్లాడుతూ.. ఈ నగదు మొత్తాన్ని జిల్లా పరిశీలన బృందాలకు అందజేస్తాం అన్నారు. తదుపరి చర్యలు EC అధికారులు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తీసుకుంటాయని ఆయన తెలిపారు.