suicide: కుమార్తె ఆత్మహత్యాయత్నం.. బాధతో తండ్రి సూసైడ్

ఇంటర్మీడియట్ ఫెయిలయిందని ఓ విద్యార్థిని మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థిని తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

suicide: కుమార్తె ఆత్మహత్యాయత్నం.. బాధతో తండ్రి సూసైడ్
X

న్యూస్ లైన్ డెస్క్: ఇంటర్మీడియట్(intermediate) ఫెయిలయిందని ఓ విద్యార్థిని మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థిని తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య(suicide)కు పాల్పడ్డాడు. హన్మకొండ జిల్లా నడికూడ మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుమారస్వామికి(47) భార్య రమాదేవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన చిన్న కూతురు శ్రీవిద్య(Srividya) గతేడాది హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైంది.

ఇటీవల సప్లమెంటరీ పరీక్షలు రాసినా పాస్(Pass) కాలేదు. దీంతో తండ్రి కూతురిని మందలించాడు. అసలే పరీక్షల్లో పాస్ కాకపోవడం, తండ్రి కోపగించుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శ్రీవిద్య ఇంట్లో ఉన్న పురుగులమందు తాగింది. ఆమెను వెంటనే పరకాల ఆస్పత్రికి తరలించారు. అయితే, తన వల్లే కూతురు ఆత్మహత్యకు యత్నించిందని భావించిన కుమారస్వామి పరకాలలోని ఫెర్టిలైజర్ షాపులో పురుగులమందు తీసుకుని కంఠాత్మకూర్ సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు వెళ్లి మందు తాగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి లోనయ్యారు.

Tags:
Next Story
Share it