floods: బ్రెజిల్ను అతలాకుతలం చేసిన వరదలు.. 57 మంది మృతి
రియో గ్రాండే డూ సుల్ రాష్ట్రంలోని వరదల ధాటికి ఇప్పటివరకు 57 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: భారీ వర్షం కారణంగా వచ్చిన వరదలు బ్రెజిల్(Brazil) దేశాన్ని అతలాకుతలం చేశాయి. రియో గ్రాండే డూ సుల్(Rio Grande do Sul) రాష్ట్రంలోని వరదల ధాటికి ఇప్పటివరకు 57 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన 67 మంది ఆచూకీ ఇంకా తిలియలేదు. కనిపించకుండా పోయిన వారి కోసం సివిల్ డిఫెన్స్ అథారిటీ(Civil Defense authority) అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు వర్షాల కారణంగా ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
Tags:
Next Story