Murder: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య

భారత విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో భారత విద్యార్థి నవ్‌జీత్ సంధు మృతి చెందారు.

Murder: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య
X

న్యూస్ లైన్ డెస్క్: విదేశాల్లో హత్యకు గురవుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఇటీవల జరిగిన ఘటనలను మరువక ముందే.. ఆస్ట్రేలియా(Australia)లో మరో హత్య చోటుచేసుకుంది. భారత విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌ విద్యార్థి నవ్‌జీత్ సంధు(Navjeeth Sandhu) మృతి చెందారు. మెల్‌బోర్న్‌(Melbourne)లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. అద్దె విషయంలో భారత్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఘర్షణ పడుతుండగా వారిని ఆపేందుకు వెళ్లిన నవ్‌జీత్‌పై దాడి జరిగిందని మృతుడి స్నేహితుడు యష్‌వీర్(Yashveer) తెలిపారు. తాను ఉంటున్న ఇంటినుంచి వస్తువులు తెచ్చుకునేందుకు వెంట రావాలని సంధును అతడి స్నేహితుడు తీసుకెళ్లగా.. అద్దె విషయంలో జరుగుతున్న ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నవ్‌జీత్‌పై కత్తితో దాడి చేశారని యష్‌వీర్ వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. మెల్‌బోర్న్‌ పోలీసులు తెలిపారు.

Tags:
Next Story
Share it