Drunker: మందు కోసం డబ్బులివ్వలేదని కన్న తండ్రినే హత్య
మద్యం కోసం డబ్బులు ఇవ్వట్లేదని కన్నతండ్రి పైనే కుమారుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.
న్యూస్ లైన్ డెస్క్: సిద్దిపేట(Siddipet) జిల్లాలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని అహ్మద్నగర్(Ahmednagar)లో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వట్లేదని కన్నతండ్రి పైనే కుమారుడు కత్తి(Knife)తో దాడికి పాల్పడ్డాడు. కుమారుడు ఫరూక్(Faruk) దాడిలో తండ్రి వలీఖాన్(Vali khan) మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం(Post mortem) కోసం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
Tags:
Next Story