Mega Star: పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి
దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మవిభూషణ్ పురస్కారాని మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదిగా ఢిల్లీలో అందుకున్నారు.
న్యూస్ లైన్ సినిమా: దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మవిభూషణ్ పురస్కారాని మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదిగా అందుకున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపసాన ఉన్నారు. ఈ ఏడాది ఐదుగురికి పద్మ విభూషణ్ వచ్చాయి. అందులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటి వైజయంతిమాల, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రమణ్యం, మెగాస్టార్ చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్లను పద్మ విభూషణ్ అవార్డులతో స్వీకరించారు. మెగాస్టార్ తెలుగులో 155 నినిమాలు చేశాడు. చీరు తన నటన, టాలెంట్తో టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు.