Rahul Gandhi: ఆ 25మంది కోసమే మోడీ పాలన

ప్రధాని నరేంద్ర మోడీపై (pm narendra modi) కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం 25మంది ప్రయోజనల కోసమే బీజేపీ ప్రభుత్వం (bjp government) పనిచేస్తుందని ఆరోపించారు.

Rahul Gandhi: ఆ 25మంది కోసమే మోడీ పాలన
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై (pm narendra modi) కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం 25మంది ప్రయోజనల కోసమే బీజేపీ ప్రభుత్వం (bjp government) పనిచేస్తుందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్‌లో (narsapur) నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, బయటపారేస్తామని ఎన్నిల ప్రచారాలలో చెబుతున్నారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయి. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడుతుంది.. ఏ శక్తి కూడా రాజ్యాంగాన్ని మార్చలేదు. దేశ ప్రజలకు దక్కిన హక్కులన్నీ రాజ్యాంగం వల్లే వచ్చాయని ఆయన అన్నారు.

గత పదేళ్ల బీజేపీ పాలనలో మోడీ చేసిందేమి లేదని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ దేశ యువతను నిరుద్యోగులుగా చేసిందని విమర్శించారు. కొత్తగా ఉద్యోగాలు సృష్టించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువతతో పాటు రైతులను మోడీ మోసం చేశారని విమర్శించారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వం కనీసం మద్దతు ధర ఇవ్వకపోగా.. పంటను కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ది చెప్పాలని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు.”

Tags:
Next Story
Share it