IPL: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీతో ఫైట్.!
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ హోరా హోరిగా సాగుతుంది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ ను ఆటగాళ్లు తీసుకెళ్తూ క్రికెట్ అభిమానులను అలరిస్తుంది. ఈ ఎడిషన్ లో భగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఢిల్లీ లోని అరుణ్ జెట్లే స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ అద్భుతంగా రాణించి పాయింట్ల పట్టికలో రెండు స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో ఉండాలి అంటే ఈ మ్యాచ్ ఢిల్లీ కు కీలకం కానుంది.
జట్టు వివరాలు
రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మైర్, రొవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యజ్వేంద్ర చాహల్.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.