IPL: టాస్ గెలిచిన పంజాబ్.. ఆర్సీబీతో ఢీ

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరెన్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

IPL: టాస్ గెలిచిన పంజాబ్.. ఆర్సీబీతో ఢీ
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ ఉత్కంఠ భరితంగా సాగుతూ క్రికెట్ లవర్స్‌కు కిక్ ఇస్తుంది. ఈ సీజన్‌లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్‌ జట్ల మధ్య ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరెన్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో రెండు జట్లు అంతగా రాణించలేకపోయాయి. పాయింట్ల పట్టికలో 6, 7 స్థానల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇరు టీమ్స్‌ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది.

జట్టు వివరాలు

పంజాబ్ కింగ్స్ జట్టు: జానీ బెయిర్‌స్టో, సామ్ క‌ర‌న్(కెప్టెన్), రీలే ర‌స్సో, జితేశ్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్), శశాంక్ సింగ్, అశుతోష్ శ‌ర్మ‌, హ‌ర్‌ప్రీత్ బ్రార్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, క‌గిసో ర‌బ‌డ‌, రాహుల్ చాహ‌ర్, అర్ష్‌దీప్ సింగ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అల్జారీ జోసెఫ్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్.

Tags:
Next Story
Share it