Tamil Nadu: సముద్రంలో ఈతకు వెళ్లి ఐదుగురు మృతి

తమిళనాడులో (tamil nadu) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు (swimming) వెళ్లి ఐదుగురు వైద్య విద్యార్థులు (medical students) మృతిచెందారు.

Tamil Nadu: సముద్రంలో ఈతకు వెళ్లి ఐదుగురు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: తమిళనాడులో (tamil nadu) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు (swimming) వెళ్లి ఐదుగురు వైద్య విద్యార్థులు (medical students) మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. తిరుచిరుపల్లిలోని ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు తమ స్నేహితుడి వివాహ వేడుక కోసం కన్యాకుమారికి వెళ్ళారు. పెళ్లి అనంతరం గ్రూప్‌లుగా కలిసి సమీపంలో ఉన్న కన్యాకుమారి తీరంలోని బీచ్‌కి వెళ్లారు. సముద్రాని చూడగానే ఈత కొట్టాలనుకొని అందులోకి దిగారు. పెద్ద ఎత్తున అలలు రావడంతో ఐదుగురు విద్యార్థులు సముద్రంలో కొట్టుకుపోయి మరణించారు. గమనించిన స్థానికులు కొంతమంది విద్యార్థులకు కాపాడారు. స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:
Next Story
Share it