Paytmతో త్వరలో అది కూడా చేయొచ్చు…!

Paytmతో ఇప్పటి వరకు మనం మనీ ట్రాన్సాక్షన్ కోసమే వాడం. కానీ ఇప్పుడు పేటీఎం కొత్త తరహా బిజినెస్‌లోకి అడుగుపెడుతోంది.

Paytmతో త్వరలో అది కూడా చేయొచ్చు…!
X

న్యూస్ లైన్, బిజినెస్: Paytmతో ఇప్పటి వరకు మనం మనీ ట్రాన్సాక్షన్ కోసమే వాడం. కానీ ఇప్పుడు పేటీఎం కొత్త తరహా బిజినెస్‌లోకి అడుగుపెడుతోంది. రైడ్ హెయిలింగ్ రంగంలోకి కూడా రాబోతున్నట్లు ప్రకటించింది. ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా ఓలా, ఊబర్ కు పోటీగా రైడ్ హెయిలింగ్ రంగంలోకి వచ్చింది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ గా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో Paytmతో ఆటో బుక్ చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో మిగితా మెట్రోనగరాల్లోనూ ఈ సేవలు మొదలుపెట్టనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Paytm యాప్ ద్వారా ఆటోను బుక్ చేస్తే అందులో పవర్డ్ బై నమ్మయాత్రి అని కనిపిస్తుందని తెలిపారు. గత రెండేళ్లలో ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు సహా ఏడు నగరాల్లో సమ్మయాత్రి ద్వారా దాదాపు 3కోట్ల 73లక్షల కోట్ల రైడ్లు నిర్వహించినట్లు ప్రకటించారు. త్వరలోనే క్యాబ్‌లను కూడా బుకింగ్ చేసుకునే ఫెసిలిటీ తీసుకురానుంది.

Tags:
Next Story
Share it