Maldives: ప్లీజ్ మాల్ధీవ్స్ రండి..రాచమర్యాదలు చేస్తాం
ఇండియన్స్.అయితే తిరిగి భారతీయ పర్యాటకులను( INDIA TOURISM) ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి టూరిజమ్ కంపెనీలు ఇదివరకే పలు ప్రయత్నాలు చేశాయి..చేస్తున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఒకప్పుడు మాల్దీవ్స్( MALDEVES) అంటే పడి చచ్చే వాళ్లంతా ఇప్పుడు మాత్రం మోదీ గారి అసలు మాల్దీవ్స్ మాటే లేదు..ఏడాదికి వేల కోట్లు మాల్దీవుల్లో ఎంజాయ్ చేసే వారు ఇండియన్స్.అయితే తిరిగి భారతీయ పర్యాటకులను( INDIA TOURISM) ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి టూరిజమ్ కంపెనీలు ఇదివరకే పలు ప్రయత్నాలు చేశాయి..చేస్తున్నాయి.
తమ దేశ ప్రజలు, ప్రభుత్వం భారతీయుల రాకపోకలకు ఘన స్వాగతం పలుకుతాయని ఇబ్రహిం ఫైసల్ అన్నారు. టూరిజంపైనే( TOURISM) ఎక్కువగా ఆధారపడే తమ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తోడ్పాటు అందించాలని మాల్దీవుల మంత్రిగా తాను కోరుతున్నానని అన్నారు. జరిగినవన్నీ మరిచిపోయి..దయచేసి ఈ గొడవలు వదిలి ..హాయిగా ఉందామన్నారు.
కొత్తగా ఎన్నికైన తమ ప్రభుత్వం కూడా భారత్తో కలిసి పనిచేయాలనుకుంటోందని అన్నారు. తాము భారత్తో ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నామని అన్నారు. కాగా ఈ ఏడాది జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ తీరంలోని లక్షద్వీప్ దీవుల సందర్శించి అక్కడి ఫొటోలు, వీడియోలను ఎక్స్లో షేర్ చేశారు. మోదీపై మాల్దీవ్స్ మంత్రులు అవమానకర మాటలు మాట్లేడే సరికి మాల్దీవ్స్ వైపు చూడ్డం మానేస్తే ఇది సంగతి.